భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో గుణశేఖర్ చాలా ప్రత్యేకం. రాజమౌళి అంతటి పేరు కూడా సంపాదించుకున్నాడు. చారిత్రక అంశాలతో కూడిన చిత్రా లను రూపొందిస్తూ గుణశేఖర్ టాలీవుడ్ సినిమా రేంజ్ ని ఎంతగానో పెచిన దర్శకుడు. అనుష్క కథానాయికగా రాణిరుద్రమ సినిమాను రూపొందించి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు గుణశేఖర్. కాగా రానా కథానాయకుడిగా హిరణ్యకశ్యప సినిమా చేయబోతున్నట్లు గుణశేఖర్ ఇంతక ముందే ప్రకటించారు. ఈ సినిమాని సురేష్ బాబు తో కలిసి గుణశేఖర్ దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేశారు.
కానీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్జ్ జరుగుతున్నప్పుడే కరోనా మహమ్మారి వచ్చి పడింది. దాంతో ఈ సినిమాని నిలిపివేస్తున్నట్టు నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. దాంతో మరో సినిమా పనుల్లో బిజీ అయిపోయారు గుణశేఖర్. ఇప్పటికే ఈ సినిమాని అధికారకంగా కూడా ప్రకటించారు. శాకుంతలం పేరుతో ఈ సినిమాని గుణశేఖర్ స్వయంగా నిర్మించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం రానాకు ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉన్నట్లు టాక్. అందుకే ఎలాగైనా 2022 కి ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.
కాగా ఇప్పుడు ఈ సినిమాని సురేష్ బాబు తో పాటు హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ కలిసి నిరిమిస్తారని సమాచారం. సుమారు 120 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారట. అందుకే 2022 నాటికి ప్రస్తుతం రానా కమిటయిన సినిమాలను పూర్తి చేసి 2022 లో హిరణ్యకశ్యప షూటింగ్ లోనే పాల్గొనేందుకు రానా సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కబోతోంది.
ఇక బాహుబలి లాంటి సినిమాల్లో నెగటివ్ రోల్ లో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు రానా. చారిత్రిక నేపథ్యం కలిగిన సినిమాల్లో ఇట్టే ఒదిగిపోయే ఫీచర్స్ ఆయన లో చాలానే ఉన్నాయి. అందుకే గుణశేఖర్ లాంటి దర్శకులు రానా కోసం ఇంత కాలం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కించబోతున్న శాకుంతలం సినిమా 2001లో ప్రారంభించి 2022 నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?