దర్శకధీరుడు రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచానాలు తారా స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ అంచనాలను బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగన్ ఇంకా పెంచారు. సీత పాత్రలో చరణ్ కి జంటగా ఆలియా భట్ కనిపించబోతుండగా కీలక పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. అజయ్ కి భార్య గా శ్రీయ శరణ్ నటిస్తోంది.
ఇంత భారీ తారాగాణం తో బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కాని కొన్ని అనుకోని కారణాల తో పాటు కరోనా వచ్చి ఆర్ ఆర్ ఆర్ కి గట్టి దెబ్బ పడింది. కాగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.
కాగా ఈ సినిమాలో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా, ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మీద కరోనా ప్రభావం పడి బిజినెస్ దర్శక, నిర్మాతలు అనుకున్న రేంజ్ లో జరగడం లేదన్న మాట వినిపిస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ రేంజ్ బిజినెస్ ఆర్.ఆర్.ఆర్’ జరగడం లేదంటున్నారు. కరోనా తో పాటు తారక్ – చరణ్ లకి పాన్ ఇండియా వైడ్ క్రేజ్ లేకపోవడం కూడా మరో కారణం అంటున్నారు. అయితే ఈ సినిమా సమ్మర్ 2021 లో లేదా అక్టోబర్ లో గాని రిలీజ్ అవుతుందని అంటున్నారు. చూడాలి అప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా రేంజ్ ఎలా మారుతుందో.