యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోతున్నవన్నీ భారీ ప్రాజెక్ట్స్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో నటించబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ఈ సినిమాని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ తో కలిసి దర్శకుడు ఓం రౌత్ నిర్మించబోతున్నారు. 750 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించినట్టు సమాచారం.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి గెటప్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ లోపే సలార్ ని అనౌన్స్ చేశాడు ప్రభాస్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడు. అయితే ఆది పురుష్ కంటే ముందే సలార్ మొదలవనుందని అంటున్నారు. జనవరి మూడవ వారం నుంచి సలార్ ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాని 2022 లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఆదిపురుష్ కూడా 2022 ఆగస్ట్ 11 న రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారకంగానూ ప్రకటించారు. ఇక రాధే శ్యామ్ 2021 లో పరిస్థితులన్ని చక్కబడితే రిలీజ్ చేసేస్తారు. కాగా మిగిలింది నాగ్ అశ్విన్ సినిమా. ఈ సినిమాని 2021 లో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ చేస్తున్న నిర్మాతల కంటే ముందే ప్రభాస్ టాలీవుడ్ నిర్మాతల వద్ద అడ్వాన్స్ తీసుకున్నారని అంటున్నారు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ కమిటయిన ప్రాజెక్ట్స్ వల్ల ముందు అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకి సినిమా ఇప్పట్లో చేయలేకపోవడంతో తిరిగి ఇచ్చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తన కోసం సంవత్సరాలు వేయిట్ చేయించడం ఇష్టం లేకనే ప్రభాస్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.