డార్లింగ్ ప్రభాస్ నటించబోతున్న స్ట్రైట్ బాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమా 2021 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబై లో ఇందుకు సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లుక్ టెస్ట్ తో పాటు హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాదు టెస్ట్ షూట్ కూడా నిర్వహించబోతున్నారట. ఈ డిసెంబర్ వరకు ఈ పనులన్ని కంప్లీట్ చేసుకొని సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.
కాగా ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రభాస్ బల్క్ డేట్స్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గా నటించబోతున్నాడు.. రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యంగా ఎంపిక చేయాల్సింది సీత పాత్ర ని. అయితే గత కొన్ని నెలలుగా ఆదిపురుష్ లో నటించే సీత పాత్ర కి ఏ హీరోయిన్ ని ఫైనల్ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడన్న దగ్గర్నుంచి సీత గా నటించేది అనుష్క శెట్టి.. కీర్తి సురేష్..కియారా అద్వానీ.. నయనతార.. దీపిక పదుకొణె.. ప్రియాంక చోప్రా.. అనుష్క శర్మ.. కృతిసనన్.. అంటూ చాలామంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అలాగే తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే ని ఎంచుకున్నారని టాక్ మొదలైంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని అనన్య కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ అయితే ఉంది. ఇప్పుడు పూరి జగన్నాధ్ టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ తో ఫైటర్ అన్న సినిమా చేస్తున్న పూరి.. ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు. కాబట్టి టాలీవుడ్ లో కూడా అనన్య కి క్రేజ్ రావడం పక్కా. మరి ఆ ఉద్దేశ్యంతో ఓం రౌత్ టీమ్ అనన్య పేరు పరిశీలిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.