పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమాతో అద్భుతమైన సక్సస్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఈ కాంబోలో సినిమా అనుకున్నప్పటికి కుదరలేదు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడనగానే ఆయన తో సినిమా చేసే దర్శకుల్లో హరీష్ శంకర్ పేరు కూడా గట్టిగా వినిపించింది. ఎట్టకేలకి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు అధికారకంగా వెల్లడయింది. ఇది ఫ్యాన్స్ కి మామూలు ఉత్సాహం కాదని చెప్పాలి.
పవన్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుబోతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ నిర్మించనున్నారు. కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా # PSPK 28 సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ ఇండియా గేట్, స్వాతంత్ర్య సమరయోధులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ – సుభాష్ చంద్రబోస్ చిత్రాలు కనిపించేలా డిజైన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకంతో పాటు రోజా పువ్వు కనిపిస్తోంది. ‘బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ వస్తోంది.. ఈసారి ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అంటూ రిలీజ్ చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను విపరీతమైన అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ – దేవీ శ్రీప్రసాద్ కాంబోలో వచ్చిన ”గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నమోదు చేసింది. మరోసారి అదే కాంబినేషన్ రిపీటవుతుండటం తో ఈ సారి పాన్ ఇండియల్ స్థాయిలో కొత్త రికార్డ్స్ నమోదవడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు.