మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ నటించే సినిమాల మీద ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలోనూ ఎంతో ఆసక్తి నెలకొంటుంది. మహానటి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల తో పాటు తమిళ నాట కూడా కీర్తి ని ఘనంగా సత్కరించారు. అందుకే కీర్తి సినిమాలని చాలా బాధ్యతగా ఎంచుకుంటోంది. అంతేకాదు మహానటి సినిమాకి ముందు పక్కా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన కీర్తి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది.
అంతేకాదు ప్రయోగాత్మకమైన సినిమాలలో నటించడానికి ముందుకు వస్తోంది. అయితే ఆ ప్రయోగాలు కీర్తి సురేష్ కి కాస్త మైనస్ అవుతున్నాయి. ఇప్పటికే భారీ అంచనాల మధ్య విడుదలైన పెంగ్విన్, మిస్ ఇండియా భారీ డిజాస్టర్ అన్న టాక్ ని మూటగట్టుకున్నాయి. ట్రైలర్ తో పెంగ్విన్ సినిమా మీద అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. కాని అందరి అంచనాలని తారుమారు చేస్తూ ఈ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా సినిమాది అదే పరిస్థితి. దీంతో కీర్తి ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయకూడదని డిసైడయినట్టు వార్తలు వచ్చాయి.
కాగా కొన్ని సినిమాలు థియోటర్స్ లో రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా టెలివిజన్ హిట్ గా నిలుస్తాయి. అలాంటి సినిమాలలో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమానే ఉదాహరణ. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజైన పెంగ్విన్ మీద కూడా కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కాని పెంగ్విన్ టెలివిజన్ లో కూడా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. చెప్పాలంటే ఇది కూడా కీర్తి కి బాగా డిసప్పాయింట్ మెంట్ అని అంటున్నారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా చేస్తుండగా ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది.