ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కి దర్శకుడిగా పరిచయం అవుతూ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేశాడు. ఈ సినిమాకోసం అల్లు అర్జున్ చాలా శ్రమించాడు. కంప్లీట్ గా తన మేకోవర్ ని ఆహార్యాన్ని మార్చుకున్నాడు. కొత్త గెటప్ కోసం చాలా కష్టపడ్డాడు. ఆర్మీ గెటప్ లో బాడీ ఫిట్ నెస్ పరంగా ఎన్నో కసరత్తులు చేశారు. మంచి కథ కథనం..మంచి సినిమా అన్న ప్రశంసలు వచ్చాయి. అయితే ఆ సినిమా ఆశించినంతగా సక్సస్ ని సాధించలేకపోయింది. దాంతో చాలా గ్యాప్ తీసుకొని ఏ దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేయాలో అనుకొని చాలా కథ లు విన్నాడు. ఫైనల్ గా మాటల మాంత్రీకుడు త్రివిక్రం తో అల వైకుంఠపురంలో సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని సాధించి ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది.
ఈ సక్సస్ తో మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చిన అల్లు అర్జున్ ఇక వరుసగా సినిమాలు చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా కమిటయ్యాడు. వీటిలో ముందుగా సుకుమార్ తో పుష్ప సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాకోసం కూడా అల్లు అర్జున్ కొత్తగా తయారయ్యాడు. అల వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్స్ నుండే జుట్టు, గడ్డం పెంచి ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేశాడు. అనుకున్నట్టుగా ఈ మేకోవర్ పుష్ప కోసమే అని ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఇక ఈ సినిమా సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఇద్దరు చాలా కష్టపడుతున్నారు.
ఇక అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాలనుకున్న అల్లు అర్జున్ కి దెబ్బ పడిందని అంటున్నారు. సుకుమార్ బన్నీ ల ఈ హ్యాట్రిక్ సినిమాకి కరోనా వైరస్ దెబ్బకొట్టింది. ఇప్పటికే పుష్ప షూటింగ్ కి మూడు నెలల బ్రేక్ పడింది. 2020 లోనే పుష్ప సినిమాని విడుదల చేయాలనుకున్న అల్లు అర్జున్ ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయ్యోలా లేవని అర్థమైపోయింది. అంతేకాదు అల్లు అర్జున్ సినిమా 2021 సమ్మర్ వరకు రానట్టే. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పెద్ద షాకే.