ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 400 కోట్ల భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమా గురించి దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా రాం చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతా రామరాజు పాత్రను టీజర్ తో రివీల్ ఎప్పుడు చేశారో అప్పటి నుంచి ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
అయితే ఆ తర్వాత తారక్ పోషిస్తున్న కొమరం భీం పాత్రని రివీల్ చేస్తారని అందరు అనుకున్నప్పటికి కరొనా, లాక్ డౌన్ కారణంగా సాధ్యపడలేదు. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికి రాజమౌళి తారక్ భీం టీజర్ ని మాత్రం రిలీజ్ చేయలేకపోతున్నారు. దాంతో ఈ మధ్య సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ గా ఆర్ ఆర్ ఆర్ హీరోల గురించి ప్రచారం చేస్తున్నారట. చరణ్ పాత్ర మాత్రమే హైలెట్ అవుతుంది కాబట్టే అల్లూరి సీతారామరాజు పాత్రని టీజర్ లో చూపించారని తారక్ పాత్ర కి కాస్త ఇంపార్టెన్స్ తక్కువ కాబట్టే రాజమౌళి అంత ఆసక్తి చూపించడం లేదని మాట్లాడుకుంటున్నారట.
అయితే ఈ విషయంలో అటు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఇటు రాం చరణ్ ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేలా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల పాత్రలను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని అంతే అద్భుతంగా డైలాగ్స్ ఉండబోతున్నాయని ఎన్.టి.ఆర్ రాం చరణ్ అదరగొడుతున్నారని ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్న సాయి మాధవ్ బుర్ర వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా మీద అభిమానులకి ఆసక్తి పతాక స్థాయిలో పెరిగిపోయింది.
ఇక ఎన్.టి.ఆర్, ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రం దర్శకత్వంలో తన 30 వ సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రాం చరణ్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తయారవుతున్న ఆచార్య లో ఒక కీలక పోషిస్తున్నాడు. అలాగే వంశీ పైడి పల్లి తో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుంది.