నేచురల్ స్టార్ గా టాలీవుడ్ లో పాపులర్ అయిన హీరో నాని. డెఫినెట్ గా మినిమం గ్యారెంటీ హీరో. అందులో ఏ ఒక్కరు సందేహపడాల్సిన అవసరం లేదు. గతంలో కొందరు పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన కొంతమంది నిర్మాతలు అడ్రస్ లేకుండా పోయారు. కాని నాని నిర్మాత ఎవరూ అలా నష్టపోయింది లేదనే మాట ఫిల్మ్ నగర్ లో ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు నాని నటించిన ఏ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది లేదు.
ఇటీవలే వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా కూడా యావరేజ్ అన్న టాక్ వచ్చింది. కాని దిల్ రాజు కి కాస్తో కూస్తో లాభాలే వచ్చాయి గాని నష్టాలు వచ్చాయన్న మాట మాత్రం వినిపించలేదు. ఇక ప్రస్తుతం నిన్ను కోరి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ డిసెంబర్ వరకు సినిమా కంప్లీట్ అవుతుందని సమాచారం.
దాంతో డిసెంబర్ నుంచి టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ్ రాయ్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కాగా నాని తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇంతకముందు ఈ బ్యానర్ లో గ్యాంగ్ లీడర్ చేసిన నాని ఆ సినిమాకి నష్టాలు రావడంతో ఇప్పుడు మరొక సినిమా చేసిపెడతానని కమిటయ్యాడట. మరి ఇందులో ఎంతవరకు వాస్తవముందో తెలీదు గాని ఇదే నిజమైతే నాని గ్రేట్ అనాల్సిందే. ఇలా సినిమా ఫ్లాప్ అయితే సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఇలాగే నిర్మాతలకి మరో సినిమా చేసేవారు.