టాలీవుడ్ లో ప్రస్తుతం కీర్తి సురేష్ మిగతా స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ సినిమాలు చేస్తోంది. తెలుగు లో మాత్రమే కాదు తమిళంలోను కీర్తి దే క్రేజ్ అండ్ పాపులారిటీ. ఇప్పటికే అటు తమిళం, ఇటు తెలుగులో చాలా సినిమాలు చేసిన కీర్తి సురేష్ కి మహానటి సినిమాతో ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో కలిసి నిర్మించే సినిమాలలో నటించడానికి ఎక్కువగా ప్లాన్స్ వేసుకోవడమే కాదు లేడీ ఓరియంటెడ్, కమర్షియల్ ఎంటర్టైనర్స్, స్టార్స్ తో వస్తున్న అవకాశాలు, నితిన్ లాంటి యంగ్ హీరోలతో వస్తున్న అవకాశాలు ..ఇలా ఏదీ వదలడం లేదు.
కథ కి ప్రాముఖ్యత ఇస్తూనే సాధ్యమైనంత వరకు వచ్చిన ప్రతీ ఛాన్స్ ని అందుకుంటోంది. రీసెంట్ గా పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ తో రంగ్ దే, రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ, తెలుగు సినిమా అన్నాత్తే సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట లోను నటించబోతుందట.
ఇక మిస్ ఇండియా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా గుడ్ లక్ సఖీ చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడు మరో భారీ సినిమాలో అవకాశం వచ్చిందట. కమల్ హాసన్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందబోయో ‘వెట్టయ్యాడు విలైయ్యాడు’ సినిమా సీక్వెల్ లో కీర్తి సురేష్ నటించబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం చేస్తున్న మహేష్ బాబు, రజినీకాంత్ అన్నాత్తే, గుడ్ లక్ సఖీ సినిమాల తర్వాత కమల్ హాసన్ సినిమాలో నటించడానికి డేట్స్ ఇచ్చిందట. మొత్తానికి కీర్తి సురేష్ తెలుగులోనే కాదు తమిళంలోను నంబర్ వన్ స్థానంలో ఉంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!