టాలీవుడ్ లో నిత్యా మీనన్ కి హీరోయిన్ గా మంచి పేరుంది. అలా మొదలైంది, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి , అ లాంటి చిత్రాలతో నిత్యా మీనన్ బాగా పాపులర్ అయింది. అయితే ఏ సినిమా ఒప్పుకున్న తనకి కథ నచ్చాలి. ఆ కథ లో తన పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉండాలి. లేదంటే రెమ్యూనరేషన్ భారీగా ఇస్తామని మేకర్స్ చెప్పినా కమిటవదు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో గత సంవత్సరం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘మిషన్ మంగళ్’ లో ఒక ముఖ్య పాత్ర పోషించింది. అక్కడ కూడా నిత్యా బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాతో బాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది. దాంతో బాలీవుడ్ లో ఏకంగా స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ తో వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ అందుకుంది. వాస్తవంగా నిత్యా మీనన్ కి ఎప్పుడో బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికి ఆసక్తి చూపించలేదు. కాని ‘మిషన్ మంగళ్’ పాత్ర తనకి బాగా నచ్చడం తో ఓకే చెప్పింది. ఇక నిత్యా మీనన్ చేసిన ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ వెబ్ సిరీస్ జులై లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. బ్రీత్ వెబ్ సిరీస్ పార్ట్ వన్ లో మాధవన్ లీడ్ రోల్ లో నటించాడు. ఇప్పుడు ‘బ్రీత్ వెబ్ సిరీస్’కు సీక్వెల్ లో అభిషేక్ బచ్చన్ నటించడంతో విశేషం.
ఇక ప్రస్తుతం నిత్యా మీనన్ దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ కూడా ఉంది. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో నిత్యా మీనన్ కి మీరు నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ప్రత్యేకత ఏంటి అన్న ప్రశ్న ఇటీవల ఎదురైంది. దాంతో నిత్య జయలలితగారి జీవితంపై సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తున్నాయి. ఎవరెన్ని తీసిన నేను చేస్తున్న సినిమాలో ఉన్న విషయాలను దర్శకురాలు ప్రియదర్శిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆవిడ చెప్పిన కథ జయలలితగారి నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు నాకు ఆసక్తిని కలిగించాయి. అందుకే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది నిత్యా మీనన్. ఇక పాత్ర కోసం నిత్యా చాలా కష్టపడుతుంది కూడా.