దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమికి అందటంతో గ్రేటర్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టిఆర్ఎస్. ఎన్నికలు అతి తక్కువ సమయంలో ఒక్కసారిగా రావటంతో టిఆర్ఎస్ వేసుకున్న లెక్కలు తప్పినట్లు వచ్చిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున గ్రేటర్ ఎన్నికల బాధ్యతను చూసుకున్నా కేటీఆర్ ప్రచారంలో ఒంటరిగా టిఆర్ఎస్ మేయర్ పీఠాన్ని సాధిస్తుందని తెలిపింది.
కానీ లెక్కలు చూస్తే ఇరవై స్థానాలకు వెనకబడి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం పొత్తు పెట్టుకునే పరిస్థితికి గులాబీ పార్టీ దిగజారిపోయింది. అయితే టిఆర్ఎస్ పార్టీ ఈక్వేషన్స్ మారటానికి తెలంగాణ రాజకీయాలలో వినబడుతున్న టాక్ చూస్తే..మొట్టమొదటిగా అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఓడామని టిఆర్ఎస్ పార్టీ అంచనాకు వచ్చినట్లు పార్టీ లో వినపడుతున్న టాక్.
అంతేకాకుండా గతంలో ఉన్న సిట్టింగులను ఎక్కువమందిని మార్చకపోవడం మాత్రమే కాక… వారిపై అవినీతి ఆరోపణలు కావచ్చు, అలాగే వారిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ప్రజలలో ఉండటం మాత్రమే కాక చాలా మంది టిఆర్ఎస్ అభ్యర్థులపై ల్యాండ్ కబ్జా ఆరోపణలు ఉండటం ఓటమికి ఒక కారణమని పార్టీ అంచనా వేసినట్లు సమాచారం. అదే కాకుండా చాలా తక్కువ ఎన్నికల ప్రక్రియకు సమయం రావడంతో 150మంది లో 32 మంది కొత్తవారిని తీసుకొచ్చిన వారికి ప్రజలలో సరిగ్గా గుర్తింపు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేశాయని టిఆర్ఎస్ పార్టీ అంచనాకు వచ్చినట్లు తెలంగాణ రాజకీయవర్గాలలో టాక్ వస్తోంది. ఉద్యోగస్తులు అదేవిధంగా చదువుకున్న యువత ఓటు టిఆర్ఎస్ కి పడలేదని పార్టీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అంచనాల మేరకు ఫలితాలు రాబట్ట లేకపోవటం ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.