టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత చిత్రం భీష్మ తో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలు చేయాలనుకున్నాడు. కాని కరోనా తో తను ఫైనల్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని పెండింగ్ లో పడ్డాయి. భీష్మ సక్సస్ తో మంచి ఊపులో ఉన్న నితిన్ రంగ్ దే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహలు చేసి శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఇంకా 20 శాతం టాకీ పార్ట్ కంప్లీట్ కాకుండానే సినిమా లాక్ డౌన్ తో నిలిచిపోయింది.
ఈ సినిమాలో నితిన్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తుండగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ అభిమానులకి విపరీతంగా నచ్చింది. ఇక త్వరలో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు నితిన్ టీం ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ సినిమా తర్వాత నితిన్ మరో రెండు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్న ఇచ్చాడు. అందులో ఒకటి చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమా చంద్ర శేఖర్ ఏలేటి పంథా లోనే సస్పెన్స్ త్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం. అలాగే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాధున్ లో నితిన్ నటించనున్నాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన అంధాదున్ లో హీరో ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమనటుడు అవార్డు సాధించాడు.
దాంతో నితిన్ ఈ సినిమాని తెలుగులో తనే హీరోగా నటించడానికి రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరన్నది కన్ఫర్మ్ కావడం లేదు. మరోసారి కీర్తి సురేష్ నటిస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. కాని అవి రూమర్స్ అని చిత్ర యూనిట్ క్లారి ఇచ్చారు. ఇక తాజాగా ఈ సినిమాలో నితిన్ సరసన పూజా హెగ్డే ని సంప్రదించారట చిత్ర బృందం.
కాని పూజ హెగ్డే సున్నితంగా ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని సమాచారం. అందుకు కారణం ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో వరసగా సినిమాలు చేస్తుండటంతో నితిన్ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేకనే రిజెక్ట్ చేసిందని అంటున్నారు.