టాలీవుడ్లో రెండేళ్ళ క్రితం డ్రగ్స్ వ్యవహారంలో చాలామందిని అనుమానుమానించి చేసిన రచ్చ మళ్ళీ తిరిగి తెరపైకి వచ్చింది. ఇదివరకు ఈ డ్రగ్ దందా టాలీవుడ్ హీరోయిన్ల దగ్గరి నుండి, హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ తో సహా పలువురి మెడకు చుట్టుకుంది. ఆ సమయంలో ఈ వార్త పెద్ద సంచలంగా మారింది. ఇక ఆ వివాదం సమసిపోయిందనుకున్న తరుణంలో మళ్లీ ఈ మాదక ద్రవ్యాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈసారి బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్యతో రగుకులుకున్న ఈ డ్రగ్స్ మంటలు శాండల్వుడ్ను తాకి టాలీవుడ్ వరకు వచ్చాయి.
ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో రియా.. డ్రగ్స్ తో సంబంధమున్న పలువురు సెలబ్రిటీల పేర్లు చెప్పిందని.. అందులో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఉన్నాయని ప్రచారం జరిగింది.
దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా రకుల్ ని ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై ఎన్సీబీ అధికారులు సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు ఇందులో లేవని వెల్లడించారు. అంతే కాదు తమ దగ్గరున్న జాబితాలో కేవలం డ్రగ్స్ స్మగ్లర్ల పేర్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే డ్రగ్ కేసులో ఇంత వివాదం తన చుట్టు ముసురుతున్న కూడా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీనిపై స్పందించలేదు.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రకుల్.. కనీసం దీనిపై స్పందిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టలేదు. ఇలా రకుల్ సైలెంటుగా ఉండకుండా డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు రావడాన్ని ఖండిస్తూ ఓ ట్వీట్ చేస్తే బాగుంటుందని లేదంటే ఈ వివాదాన్ని అందరూ మరోలా ఆలోచించే అవకాశం ఉందని, ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైన రకుల్ మౌనం వెనక దాగున్న రహస్యాన్ని ఎవరికి తోచిన విధంగా వారు అర్ధం చేసుకుంటున్నారన్నది నిజం. మరి ఎందుకు రకుల్ ఇలా మౌనంగా ఉంటుందన్నది ఎవరి అర్థం కావడం లేదు. తనకి సంబంధం లేని విషయాలలో ఎందుకు తలదూర్చడం అన్న కారణమగానే సైలెంట్ గా ఉందని అంటున్నారు.