ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 29 వ సినిమా కాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరో. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో కనిపించబోతుండగా సినిమా మొత్తంలో మొత్తం 6 రకాల గెటప్స్ లో సర్ప్రైజ్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరెస్ నటిస్తుంది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30 వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ సినిమాగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాస్తున్నాడని.. అది రాజకీయ నాయకుడి పాత్ర అన్న న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.
అంతేకాదు ఈ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. అయితే మోహన్ లాల్ ఈ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది ఇంకా ప్రకటించలేదు. ఇంతకముందు ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి జనతా గ్యారేజ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని తెలుస్తుంది.
ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా సినిమా కాబట్టి తారక్ పక్కన జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ అన్న భావనతో సంప్రదించినట్టు చెప్పుకుంటున్నారు. కాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి 2022 సంక్రాతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రాం గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నాడట.