Pawan kalyan: అల్లు అర్జున్తో తీసిన ‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అనౌన్స్ చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి స్క్రీన్ ప్లే – డైలాగ్స్ రాసే బాధ్యతను తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ సెట్ చేసింది ఆయనే అని టాక్ వినిపిస్తోంది.
ఈ కారణంగా మహేష్తో మొదలు పెట్టాల్సిన మూవీని కూడా హోల్డ్ పెట్టి ముందు పవన్ కళ్యాణ్ – రానా సినిమాను పూర్తి చేయాలని డిసైడయ్యారట. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేశాకే మహేష్ సినిమా పనులు మొదలు పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ విషయం షూటింగ్ స్పాట్లో రెగ్యులర్గా త్రివిక్రమ్ కనిపించడాన్ని బట్టే అర్థమవుతోంది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నప్పటికీ అన్నీ తానై చూసుకుంటున్నారట. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులుంటే త్రివిక్రమ్ కూడా అన్ని రోజులు సెట్ లో ఉంటుంన్నారట.
ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ రాయడం తో పాటు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. సెట్లో పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులుంటే త్రివిక్రమ్ కూడా అన్ని రోజులు సెట్ లో ఉంటుంన్నారు. దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇంకా మహేష్ సినిమా కోసం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ చేయలేదనే టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోందట. ‘అతడు’ ,’ఖలేజా’ లాంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా రూపొందబోతోంది. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి రానుందో. ఇక మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది.