థమన్ మానియా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న థమన్.. భారీ హిట్స్ ఇస్తున్నాడు. హీరో తో పాటు సినిమా కథ నేపథ్యానికి తగ్గట్లుగా మ్యూజిక్ సెన్స్ ఉన్న థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా కి థమన్ ఇచ్చిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తమన్ రేంజ్ టాలీవుడ్ లో పూర్తిగా మారిపోయింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా థమన్ పాటలకు ఫిదా అయ్యారు.
రీసెంట్ గా బుట్ట బొమ్మ సాంగ్ కి సోషల్ మీడియాలో కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు థమన్ మ్యూజిక్ ఎంతగా జనాలని మ్యాజిక్ చేస్తుంది. అందుకే టాప్ డైరెక్టర్లు థమన్ మ్యూజిక్ అంటే పడి చచ్చిపోతున్నారు. దీంతో థమన్ కు క్రేజీ ఆఫర్స్ చేతిలో పడుతున్నాయి. అల వైకుంఠపురంలో మూవీ మ్యూజిక్ కి ఫ్లాట్ అయిన వారిలో త్రివిక్రమ్ కూడా ఒకరు. థమన్ మ్యూజిక్ కు మెస్మరైజ్ అయిన త్రివిక్రమ్ తన సినిమాల్లోనే కాదు పక్కవారి సినిమాల్లోనూ థమన్ ను రిఫర్ చేస్తున్నారట.
ఆల్రెడీ హిట్లతో మంచి ఊపు మీదున్న థమన్ కి మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమాలో మ్యూజిక్ అందించే అవకాశాన్ని కొట్టేశాడు థమన్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. వీరికి జోడిగా సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారని సమాచారం. భారీ అంచనాలతో రూపొందబోతున్న ఈ మలయాళం మూవీ రీమేక్ కు థమన్ పేరుని రిఫర్ చేశారట త్రివిక్రమ్. ఇప్పటికే పవన్ రీఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సిచువేషన్ చూస్తుంటే త్రివిక్రమ్ థమన్ ని పవన్ కి దగ్గర చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.