Trivikram : త్రివిక్రం ఎప్పుడూ పక్కాగా కథ కథనం రెడీ అయ్యాకే సినిమా ప్రకటిస్తాడని పేరుంది. ప్రీప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తి చేశాకే సెట్స్ మీదకి వస్తాడు. అలాంటిది జస్ట్ లైన్ చెప్పి ఎన్టీఆర్ 30 అనౌన్స్ చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇలా రావడానికి కారణం ఎన్టీఆర్ 30 ఉన్నపలంగా ఆగిపోవడమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చేస్తుండగా ఈ సినిమా తర్వాత మాటల మాంత్రీకుడు దర్శకత్వంలో తన 30వ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించేశారు. ఈ సినిమాకి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థలు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎన్టీఆర్ 30 ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టు తెలిపారు. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత మళ్ళీ త్రివిక్రం – తారక్ కాంబోలో సినిమా అనగానే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. గత రెండేళ్ల ఈ కాంబో మీద రక రకా వార్తలు వస్తుండగా ఇటీవల అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ప్రకటన వచ్చింది. తారక్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించారు.
Trivikram : త్రివిక్రం పూర్తి స్థాయిలో కథ లేకుండానే ఎన్టీఆర్ 30ని ప్రకటించారట.
ఈ విషయంలో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు హ్యాపీనే. కానీ తారక్ – త్రివిక్రం సినిమా ఎందుకు ఆగిందనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. అయితే త్రివిక్రం పూర్తి స్థాయిలో కథ లేకుండానే ఎన్టీఆర్ 30ని ప్రకటించారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – రానా నటిస్తున్న సినిమాకి త్రివిక్రం స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమాతో బిజీగా ఉండటం వల్లే తారక్ సినిమా కథ రెడీ చేయలేకపోయినట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఇద్దరి కాంబోలో ప్రకటించిన సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందని సమాచారం.