Uppena : ఉప్పెన సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ కి హీరో, హీరోయిన్ గా పరిచయమయ్యారు. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్ కి రెడీ అయి కూడా దాదాపు సంవత్సరం పాటు ఆగిపోయింది. ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చినా కూడా మెగాస్టార్ సలహా మేరకు మేకర్స్ ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు.
అనుకున్నట్టుగానే థియేటర్స్ ఓపెన్ అయి 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ వచ్చాక ఉప్పెన సినిమాని థియేటర్స్ లోకి తీసుకు వచ్చారు. ఫస్ట్ హిట్ టాక్ వచ్చిన తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు. అలాగే సుకుమార్ ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని నమ్మకంగా చెప్పాడు. అలాగే ఈ సినిమా 100 కోట్లు రాబట్టిందని ఆ తర్వాత పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మించారు.
Uppena : ఉప్పెన బుల్లితెర మీద ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పుకుంటున్నారు.
డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ 20 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డ్స్ ని బ్రేక్ చేయడం కూడా గొప్ప విషయం. ఇలాంటి సినిమా స్మాల్ స్క్రీన్ మీద కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొని హైయ్యెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ రాబడుతుంటాయి. కానీ ఉప్పెన విషయంలో అలా జరగలేదని తెలుస్తోంది. రీసెంట్ గా ప్రముఖ తెలుగు ఎంటర్టైమెంట్ ఛానల్ ‘స్టార్ మా’ లో ఏప్రిల్ 18న ‘ఉప్పెన’ సినిమా ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పైన సత్తా చాటలేదంటున్నారు. హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వస్తుందని అందరూ భావించారు. థియేటర్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా బుల్లితెర మీద ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పుకుంటున్నారు.