V : వి సినిమాలో నేచురల్ స్టార్ నాని నటించిన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేతా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్స్ గా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించాడు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్స్ మూత పడి ఉండటంతో గత ఏడాది ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదన్న కామెంట్స్ వచ్చాయి.
నాని కి గత కొంతకాలంగా భారీ హిట్ దక్కడం లేదు. తను నటించిన సినిమా భారీ అంచనాల మధ్య రిలీజవుతున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద మాత్రం యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోతుంది. ఈ క్రమంలో తనకి నిన్నుకోరి సినిమాతో డీసెంట్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణతో టక్ జగదీష్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. రీతి వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించారు. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ నెల 23న ఫిక్స్ చేసిన చిత్ర బృందం కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
V : వి సినిమా మాదిరిగానే నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం మొదలైంది.
మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెల్లడించలేదు. దాంతో నాని టక్ జగదీష్ వి సినిమా మాదిరిగానే ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం మొదలైంది. ఇది నానికి తెలిసి మండిపోయినట్టు తెలుస్తోంది. ఓటీటీలో వచ్చి సక్సస్ నమోదు చేసుకోని వి సినిమా ప్రభావం ఇంకా నాని మీద ఉన్నట్టుంది. అందుకే టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ అన్న వార్త చూడగానే అగ్గిమీద గుగ్గిలం అయ్యాడట. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా థియేటర్స్లోనే రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు.