V.V.Vinayak: టాలీవుడ్లో అగ్ర దర్శకుడిగా వి.వి.వినాయక్ ఒకదశలో క్షణం తీరిక లేకుండా సినిమాలతో గడిపారు. ఆది సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వినాయక్ మొదటి సినిమాతోనే భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా చూసిన బాలకృష్ణ ఆయనతో చెన్నకేశవ రెడ్డి సినిమా తీసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా కథ, స్క్రీన్ప్లే అద్భుతంగా ఉంటాయి. ఇక అప్పటికే సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు లాంటి ఫ్యాక్షన్ కథలలో నటించిన బాలయ్యకి ఈ సినిమా కథ పర్ఫెక్ట్గా సూటయింది. బాలయ్యను ఎంత పవర్ఫుల్గా చూపించాలో అంత పవర్ఫుల్గా చూపించాడు. సినిమా రిలీజయ్యాక విమర్శల ప్రశంసలు అందుకుంది. రెండు విభిన్నమైన గెటప్స్లో వినాయక్ బాలయ్యను బాగా చూపించాడు.
V.V.Vinayak: చెన్నకేశవ రెడ్డి సినిమా కోసం వినాయక్ మరికొన్ని రోజులు కావాలని అడిగాడు.
అయితే చెన్నకేశవ రెడ్డి సినిమా కోసం వినాయక్ మరికొన్ని రోజులు కావాలని అడిగాడు. అయితే మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమా 50వ రోజుకి చెన్నకేశవ రెడ్డి సినిమా విడుదల చేయాలన్న నిర్మాతల పట్టుదలతో ఒత్తిడి చేయడంతో కాస్త హడావుడిగా చెన్నకేశవ రెడ్డి తీయడం జరిగింది. అందుకే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత వినాయక్ నితిన్ హీరోగా దిల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్న రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు.
అప్పటి నుంచి ఆయన దిల్ రాజుగా ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో పాపులర్ అయ్యాడు. ఫ్యాక్షన్ సినిమాలను అత్యద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వినాయక్కి మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాను తెరకెక్కించే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సృష్ఠించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఠాగూర్ సినిమా మెగాస్టార్ కెరీర్లో దర్శకుడిగా వినాయక్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. దాంతో వినాయక్ ఫ్యాక్షన్ సినిమాలను మాత్రమే తీయగలడనే పేరు వచ్చేసింది. లో బడ్జెట్ సినిమాలను, ప్రేమకథలను తీయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరిగింది.
V.V.Vinayak: ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్గా మారాడు.. దాంతో వినాయక్ స్లో అయ్యాడు.
ఆ తర్వాత వినాయక్ తీసిన సాంబ, యోగి, లక్ష్మీ, కృష్ణ, బద్రినాథ్, నాయక్ లాంటి సినిమాలు చేసిన అందులో ఆయన మార్క్ ఫ్యాక్షనిజం కనిపించింది. మధ్యలో అదుర్స్ వంటి సినిమా చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చినా ఆయన ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్గా మారాడు. దాంతో జనాలలో ఫ్యాక్షన్ కథలను పక్కన పెట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, కామెడీ జోనర్ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపించగానే వినాయక్ స్లో అయ్యాడు. అల్లుడు శీను, అఖిల్ సినిమాలు తీసి ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా తీసి హిట్ ఇచ్చినా ఇలాంటి రీమేక్ కథ వినాయక్ కాకుండా ఎవరైనా తీయగలరని చెప్పుకున్నారు.
ఆ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంటిలిజెంట్ సినిమా తీశాడు. మరోసారి మెగాస్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చి కూడా ఆయన కథతో తృప్తి చెందక మోహన్ రాజాను తీసుకున్నారు. ఇప్పుడు ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న వినాయక్ నేరుగా హిందీలో ఎంట్రీ ఇస్తున్నాడు. చూడాలి హిందీ డెబ్యూతో సక్సెస్ అవుతాడా లేదా. ఇటీవలే ఛత్రపతి సినిమాను మొదలు పెట్టాడు వినాయక్. హీరోగా బెల్లంకొండ శ్రీనుకి హిందీలో ఇది డెబ్యూ సినిమా. ఇక్కడ బెల్లంకొండ శ్రీనుని హీరోగా పరిచయం చేసింది వినాయక్. ఇప్పుడు బాలీవుడ్లో కూడా వినాయక్ పరిచయం చేస్తుండటం ఆసక్తికరం.