Vamisi paidipalli: వంశీ పైడిపల్లి..టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి దర్శకుడిగా మారాడు వంశీ పైడిపల్లి. అంతకముందు రచయితగా, అసోసియేట్ డైరెక్టర్గా దిల్ రాజు ప్రొడక్షన్స్లో వర్క్ చేశాడు. అలా నిర్మాత దిల్ రాజుకు చాలా సన్నిహితుడయ్యాడు వంశీ పైడిపల్లి. ఇక ఆయన 2007 లో డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందిన ‘మున్నా’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
వంశీ పైడిపల్లి తర్వాత డైరెక్టర్స్గా మారినవారందరూ జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం నిదానమే ప్రధానం అనేట్టుగా ఒక్కో సినిమాకు చాలానే గ్యాప్ తీసుకుంటున్నాడు. ఆయన తీసిన సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలను రూపొందిస్తున్నాడు. సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ ఆయన ఇండస్ట్రీకొచ్చి 14 ఏళ్ళవుతున్న తన కెరీర్ లో కేవలం 5 సినిమాలనే తీశారు. మున్నా తర్వాత వంశీ పైడిపల్లి తీసిన సినిమా ‘బృందావనం’.
Vamisi paidipalli: మహేశ్ బాబుతో తీసిన ‘మహర్షి’ కోసం మరో 3 ఏళ్లు టైం తీసుకున్నారు.
ఈ సినిమాతో ప్రేక్షకుల బాగా ఆకట్టుకున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి 4 ఏళ్ళ సమయం తీసుకున్నారు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లతో ‘ఎవడు’ సినిమా తీసి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకి 4 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున – కోలీవుడ్ స్టార్ హీరో కార్తిలతో ‘ఊపిరి’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా కోసం 2 ఏళ్లు ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీసిన ‘మహర్షి’ కోసం మరో 3 ఏళ్లు టైం తీసుకున్నారు.
మహర్షి మూవీ తర్వాత అంతగా గ్యాప్ రాదనుకుంటే మళ్ళీ 2019 నుంచి కొత్త మూవీ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తునే ఉన్నాడు. గత ఏడాది మరోసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దిల్ రాజు నిర్మాణంలో సినిమా మొదలవ్వాల్సింది. కానీ, అంతా ఓకే అనుకొని ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత పూర్తి స్థాయి స్క్రిప్ట్ విన్న మహేశ్ ..అంతగా స్క్రిప్ట్ నచ్చక ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు. దాంతో ఇదే కథను కాస్త మార్చి రాం చరణ్తో చేయాలని ట్రై చేశాడు. కానీ ఎందుకనో ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
Vamisi paidipalli: వంశీ పైడిపల్లి సినిమాలు తీయడంలో వేగం పెంచితే బావుంటుంది.
ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో టాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేయబోతున్నాడు. దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కు కూడా 3 నుంచి 4 ఏళ్ళు గ్యాప్ వస్తుందని చెప్పుకుంటున్నారు. వంశీ డైరెక్టర్ అయిన తర్వాత చాలా సినిమాలు చేయకపోయినప్పటికీ చేసిన సినిమాతో మాత్రం మంచి హిట్ అందుకుంటున్నాడు. ఇలాంటి దర్శకుడు ఏడాదికి కనీసం ఒక సినిమా చేసినా ఈ పాటికి కనీసం 14 నుంచి 15 సినిమాలు చేసి ఉండేవాడు. ఇకపై నుంచైనా వంశీ పైడిపల్లి సినిమాలు తీయడంలో వేగం పెంచితే బావుంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?