గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెంటికీ చెడ్డ రేవడయ్యారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.2014,2019 ఎన్నికల్లో టిడిపి తరుపున గన్నవరం నుండి గెలిచిన వంశీ అకస్మాత్తుగా జగన్ కి జై కొట్టారు.
టిడిపిలో అంతర్గత కుమ్ములాటల కారణంగా అక్కడ ఇమడలేని నేపథ్యంలోనే వంశీ వైసీపీ వైపు వచ్చారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుని హోదాను తీసేసే ఉద్దేశం తో జగన్ ఆయనని వైసీపీలో చేర్చుకున్నారు.జగన్ ను కలిసిన తర్వాత వల్లభనేని వంశీ రెచ్చిపోయాడు. చంద్రబాబును అడ్డమైన తిట్లు తిట్టి ఏపీ సీఎం జగన్ ను పొగిడి అసెంబ్లీలో నాకు సపరేట్ సీటు కావాలని చెప్పి కూర్చున్నాడు.అధినేత జగన్ వంశీని దగ్గరకు తీసినప్పటికీ గన్నవరం నియోజకవర్గం లోని పార్టీ శ్రేణులు మాత్రం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించాయి.
అంతకుముందు ఎన్నికల్లో వల్లభనేని వంశీ ‘బుద్ది ఉన్న వాడు.. ఎవడైనా వైసీపీలో చేరుతాడా’ అని పెద్ద ఎత్తున జగన్ ను ఇదే నోటితో తిట్టాడు. అప్పుడు వైసీపీ వైసీపీ నేతలు తీవ్రంగా మనస్థాపం చెందారు .ఇప్పటికీ వారి మనసుల్లో వంశీ అంటే వ్యతిరేక భావన పోలేదు.వైసీపీలోకి వచ్చినా కూడా వంశీ దుందుడుకువైఖరిని వైఖరిని విడనాడలేదు.ఒక సందర్భంలో జగన్ సునామీ లోనే నేను గెలిచాను అని వ్యాఖ్యానించడం ద్వారా తాను తోపు అన్నట్లుగా వంశీ చెప్పుకున్నారు.ఇంకో సందర్భంలో గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేని, వైసిపి ఇన్చార్జి ని తానేనని చెప్పి ఇంకో వివాదం రాజేశారు. దీంతో మొదటి నుంచి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ కి కొండంత అండగా ఉన్న రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు ఆయనపై నిప్పులు కక్కారు.ఈమధ్య వైసిపి కార్యకర్తలపై వంశీ వర్గీయులు దాడులు సైతం చేశారు.
దీంతో అసలేం జరుగుతోందని గన్నవరం నుంచి వైసీపీ హైకమాండ్ రిపోర్ట్స్ తెప్పించుకుందంట.. దీంతో వల్లభనేని వంశీని పక్కనపెట్టే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందని అని కృష్ణా జిల్లా వైసీపీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.ఈ పంచాయతీ అంతా జగన్ దగ్గరికి వెళ్ళిందట. వంశి వైఖరిపై జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని సమస్యలు సృష్టించే వాడు మనకు అవసరం లేదని కామెంట్ చేశారని వైసిపి ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అధ్యాయం వైసీపీలో ముగిసి పోయినట్లే అని చెప్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి