Varalakshmi sarathkumar : జయమ్మ అంటే బాగా పాపులర్ ..ఆ పాత్రతోనే ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్, హీరోలు, అభిమానులు ప్రేక్షకులు పిలుచుకుంటున్నారు.అంతగా తమిళ నటి వరలక్ష్మీ శరత్కుమార్ జయమ్మ పాత్రలో ఒదిగిపోయి నటించి టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇంతకాలం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రకాల విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఆమె చేసిన ప్రతీ పాత్రకి మంచి పేరు వచ్చింది. సాధారణంగా ఎవరైనా స్టార్ హీరోయిన్ అవ్వాలనే కోరుకుంటారు. అందుకోసమే తాపత్రయపడుతూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ వరలక్ష్మీ శరత్కుమార్ మాత్రం హీరోయిన్ పాత్ర కోసమే మడికట్టుకు కూర్చోలేదు.
తన వద్దకి వచ్చిన అవకాశాలలో ది బెస్ట్ అనుకున్న ప్రతీ పాత్రను వదలకుండా చేశారు. దాంతో ఆమె విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం దక్కింది. ఈ క్రేజ్ వల్ల టాలీవుడ్ దర్శక, నిర్మాతల కన్ను వరలక్ష్మీ శరత్కుమార్ మీద పడింది. వాస్తవంగా ఆమె తెలుగులో సినిమా చేసేనందుకు ఎప్పటి నుంచో ఎదురు చూసిందట. కానీ ఇంతకాలం మనవాళ్ళ దృష్టి ఆమెపై పడలేదు. ఎట్టకేలకి మాస్ మహారాజ రవితేజ ఆ అవకాశం కల్పించాడు. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ అండ్ కాప్ స్టోరి క్రాక్ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
Varalakshmi sarathkumar : హనుమాన్ లో వరలక్ష్మీ శరత్కుమార్ ముఖ్య పాత్ర..!
డెబ్యూ సినిమాతోనే జయమ్మగా అదరగొట్టింది. రేయ్ కాకీ అన్న డైలాగ్ తో మోత మోగించింది. ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ నటించిన నాంది లో కూడా లాయర్ రోల్ లో నటించారు. ఈ రెండు పాత్రలు వరలక్ష్మీ శరత్కుమార్ కి తెలుగులో భారీ క్రేజ్ తీసుకు వచ్చాయి. ఈ క్రేజ్ వల్ల పెద్ద హీరోల సినిమాలలో ఆమె కి ఆఫర్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది. ఆల్రెడీ మరోసారి గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇదే క్రమంలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోతున్న లేటెస్ట్ సినిమా హనుమాన్ లో ముఖ్య పాత్రలో నటించడానికి అడిగినట్టు..అందుకు ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.