ప్రస్తుతం రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఫిక్షన్ కథ తో ఆర్ ఆర్ ఆర్ అన్న భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగణ్ లతో పాటు హాలీవుడ్ నటులు ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య 350 కోట్ల కి పైగా బడ్జెట్ ని కేటాయించి నిర్మిస్తున్నారు. రౌద్రం రణం రుథిరం అన్న పూర్తి టైటిల్ ని రివీల్ చేసినప్పటి నుంచి ఈ పాన్ ఇండియా సినిమా బాహుబలి కంటే రెట్టింపు క్రేజ్ ని ఇప్పటికే సాధించిన సంగతి తెలిసిందే.
ఇక రీసెంట్ గా ఈ దర్శక ధీరుడు తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్ నారాయణ నిర్మిస్తారని కూడా అధికారకంగా వెల్లడించాడు. దాంతో ఒక వైపు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తూనే మరో వైపు తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి మహేష్ కోసం కథ తయారు చేస్తున్నారని తెలుస్తుంది.
అయితే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు సౌత్ అండ్ నార్త్ లో ఉన్న చిత్ర పరిశ్రమలను భయపెడుతున్నాయట. సినిమా థియేటర్స్ తిరిగి ప్రారంభం అయినా రానున్న రోజులలో వసూళ్ల పరంగా పరిస్థితి ఎలా ఉంటుందో వర్మ చెప్పిన విశ్లేషణ చాలా మంది మేకర్స్ ని కంగారు పెడుతున్నాయి. ఇప్పటి నుంచి చూసుకున్నా ఇంకో సంవత్సరం థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదు…ఒకవేళ థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ ఒకప్పటిలా వసూళ్లు జోరు మీద కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అన్నాడు. ఎంత గొప్పగా చెప్పుకున్నా 30 నుండి 40 శాతం వసూళ్లు మాత్రమే రావచ్చని అభిప్రాయపడ్డారు వర్మ.
ఈ రకంగా చూస్తే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా లాభాలు రాబట్టాలంటే ఎంత లేదన్నా 600కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి. థియేటర్స్ కి వచ్చే వారి సంఖ్య ఆ స్థాయిలో పడిపోతే ఇది సాధ్యం కాదని తెలుస్తుంది. మొత్తానికి వర్మ అంచనా ప్రకారం రానున్న కాలంలో సినిమా ఇండస్ట్రీకి కష్టకాలమే అని అర్థమవుతుంది. మరి ఈ వ్యాఖలని రాజమౌళి ఎలా పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!