Drushyam 2 : విక్టరీ వెంకటేశ్ – మీనా నటిస్తున్న సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం-2. ఈ సినిమా విషయంలో హీరో వెంకటేశ్ కొన్ని ఛేంజెస్ చెప్పినట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయట. మలయాళంలో మోహన్ లాల్ – మీనా నటించిన సినిమా ‘దృశ్యం’. ఈ సినిమా చూడని ప్రేక్షకుడు ఉండరంటే నమ్మి తీరాల్సిందే. మలయాళం, తెలుగు, హిందీ, తెలుగు భాషలలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ ఫ్యామిలీ వాటిని ఎలా ఆ కుటుంబం ఎలా ఎదుర్కుందనేది కథ. ఈ కథను ఎంతో ఎమోషనల్ గా డైరెక్టర్ జీతూ జోసెఫ్ వెండితెర మీద ఆవిష్కరించాడు.
దాంతో ఈ సినిమా సీక్వెల్ ని రూపొందించారు. దృశ్యం 2 గా మలయాళంలో మోహన్ లాల్ – మీనా నటించారు. సీక్వెల్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో తెలుగులో ఈ సినిమా వెంకటేశ్ చేశాడు. ఇక్కడ కూడా మీనా హీరోయిన్ గా నటించగా..జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. కాగా కొన్ని కీలకమైన మార్పులను వెంకీ సూచించాడట. ఆయన గతంలో నటించిన తమిళ రీమేక్ సినిమాలు ఇక్కడ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రేక్షకులు ఎలా అయితే సినిమా ఉంటే ఆదరిస్తారో అలా దర్శకుడికి సూచనలు చేశారట.
Drushyam 2 : ఓటీటీలో రిలీజ్ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నారట.
దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందట. దాంతో రిలీజ్ విషయంలో కూడా ఇప్పుడు చర్చలు సాగుతున్నాయట. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ కాకపోతే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో..దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో. ఇక తమిళ హిట్ సినిమా అసురన్ రీమేక్ నారప్ప కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ క్రమంలో రూపొందుతున్న మల్టీస్టారర్ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ వెంకటేశ్ – వరుణ్ తేజ్ – తమన్నా – మెహ్రీన్ హీరో, హీరోయిన్స్గా నటిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?