ఎన్నికలు నిర్వహించేది తేదీలు ప్రకటించేది దాని నిర్వహణ అంతా… భారతదేశంలో ఓ స్వతంత్ర వ్యవస్థ చేస్తుంది. దానిని ఎన్నికల కమిషన్ అంటారు. ఎన్నికల కమిషన్కు భారత రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించింది. ప్రత్యేక అధికారాలు ప్రత్యేక విధులు ఉంటాయి.. ఈ కమిషన్ విషయాల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు… వారి పై అధికారం ఎవరికీ ఉండదు… మొత్తం రాష్ట్రా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, కేంద్రం లో లోక్సభ ఎన్నికలను జాతీయ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తే, రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు నిర్దిష్ట కాలం ఉంటుంది. అలాగే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పదవి పూర్తవకుండానే చనిపోతే అక్కడ మళ్లీ ఉప ఎన్నికలు తగిన సమయానికి నిర్వహించడం ఎన్నికల కమీషన్ బాధ్యత. ఇలా చాలా విధులు బాధ్యతలు ఎన్నికల కమిషన్ కు ఉంటాయి కాబట్టి వారికి సర్వస్వతంత్ర ఉంటుంది. దీనిలో పాలకులు లేదా రాజకీయ నాయకులు వేలు పెట్టడానికి లేదు… ఇది లెక్క…….. అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని అనుకున్నట్టు సాగితే చెప్పుకోవడానికి ఏముంటుంది? ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి మధ్య స్థానిక సంస్థల ఎన్నికల పై కోర్టులో గొడవ నడుస్తుంటే మధ్యలో వైసీపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం స్థానిక సంస్థలను ఏప్రిల్ మే నెలలో నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరం వింతగా ఉందని రాజకీయ నాయకులు న్యాయనిపుణులు చెబుతున్నారు. అసలు ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న ప్రశ్న టాలెత్తుతోంది.. ఇది కచ్చితంగా ఎన్నికల కమిషన్ విధులకు ఆటంకం కలిగించడమే అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఎలా ప్రకటిస్తారు?
**విజయసాయిరెడ్డి పలు విషయాల్లో అత్యుత్సాహం చూపుతారు. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టడం లేద, ట్వీట్ చేయడం అలవాటు చేసుకున్నారు. లేనిపోని దానికి వివాదాలు సృష్టించడం విజయసాయిరెడ్డికి అలవాటుగా మారింది. ఇప్పుడు బుధవారం ఎవరు అడగకుండానే విజయసాయి రెడ్డి ఈ ప్రకటన చేయడం ఏప్రిల్ మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అప్పటికి కరోనా తగ్గుతుంది అని చెప్పడం చూస్తే ఆయన కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారా అనిపిస్తుంది. అడగని విషయానికి ప్రతిదానికి ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అవుతారో వైసిపి నాయకులు కే అంతుపట్టని విషయం. అసలు ఏదైనా ఉంటే కనీసం ముఖ్యమంత్రి జగన్ ను సంప్రదించి అయినా ఈ వ్యాఖ్యలు చేయాల్సి ఉందని అసలు సంబంధం లేని విషయం లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని కొందరు వైసీపీ నాయకులు చిర్రుబుర్రులాడుతూ ఉన్నారు. ఎన్నికల తేదీలు నిర్వహణ అంతా చూసుకునేది ఎన్నికల కమిషన్ కదా? విజయసాయిరెడ్డి ఇప్పుడు తేదీలు నెలలు ప్రకటించడం స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేలా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
కోర్టు దిక్కరణ కాదా??
**ప్రస్తుతం స్థానిక సంస్థల వివాదం కోర్టులో ఉంది. హైకోర్టులో గత మూడు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు జగన్ కు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతం హైకోర్టు రాజ్యాంగ సంక్షోభం రాకూడదని మధ్యవర్తిత్వం వహించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కూడిన ఒక కమిటీని నిమ్మగడ్డ రమేష్ వద్దకు పంపాలని ఆయన ను ఒప్పించి లేదా ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కు స్థానిక సంస్థలు ఎప్పుడు జరపాలి లేదు అన్న విషయం పూర్తిగా ఆయన పరిధిలో ఉంటుంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర శాసనసభ సైతం తీర్మానం చేసి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కరోనా ఎక్కువగా ఉందని ఉందని చెబుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు సైతం పక్కన పెడుతూ ఎన్నికల నిర్వహణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం అయిపోయిన తర్వాతే నిర్వహిస్తామని కోణంలో ఉంది. దీనిపై రోజు వివాదం నడుస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డి ప్రకటన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేది. అందులోనూ విచారణలో ఉన్న విషయం మీద విజయసాయిరెడ్డి ఎలా ప్రకటన చేస్తారని ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ అవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద మంట మీద ఉన్న హైకోర్టు దీనిని సైతం సుమోటోగా తీసుకొని.. విజయసాయిరెడ్డికి నోటీసు ఇస్తే అనవసరంగా ఇరుక్కుంటారా అన్నది న్యాయ నిపుణుల సూచన.