శ్రీలంకలోని కొలంబోలో బాంబు పేలుళ్లకు కారణం తామే నంటూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది.
ఈ మేరకు ఐసిస్కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటల్స్ లో బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని పేర్కొంది.
కొలంబోలో చర్చిలు, హోటల్స్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 310 మంది మృతి చెందగా, ఐదు వందల మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.