Israel: మిడిల్ లిస్టులో అరబ్ కంట్రీ లు ఇజ్రాయెల్ దేశం అంటే ఒంటికాలితో యుద్ధానికి సిద్ధమైనట్లుగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇజ్రాయిల్ దేశానికి అదే రీతిలో చుట్టూ ఉన్న ఆరు గంటలకు మధ్య ఎప్పుడూ యుద్ధం వాతావరణం.. బాంబుల వర్షం అలుముకున్నే ఉంటాయి. కొద్ది నెలల క్రితం పాలస్తీనా ప్రాంతానికి చెందిన హమాస్ టెర్రరిస్టుల కి.. ఇజ్రాయిల్ సైనికులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
గాజా ప్రాంతం నుండి ఇజ్రాయెల్ పౌరులు నివసిస్తున్న అపార్ట్మెంట్ లపై ఇళ్లపై వరుసగా రాకెట్ల దాడి చేసి దాదాపు పదకొండు రోజులపాటు ఇజ్రాయెల్ పౌరులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు ఉగ్రవాదులు. ఆ తర్వాత కొన్ని దేశాలు ఈ విషయంలో కలత చేసుకోవడంతోపాటు ఐక్యరాజ్యసమితి కూడా ఇన్వాల్వ్ అవటంతో.. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య బాంబుల వర్షం వాతావరణం కూల్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా మిడిల్ ఈస్ట్ లో సరికొత్త వాతావరణం.. నెలకొంది.
Read more: Israel: మిడిల్ ఈస్ట్ లో సరికొత్త రాజకీయ వాతావరణం ..ఇజ్రాయెల్ కి దూరంగా అమెరికా..??
అరబ్ కంట్రీ లలో ఒకటైన బెహరిన్ తాజాగా వారి దేశానికి చెందిన ఖలీద్ యూసఫ్ నీ ఇజ్రాయెల్ దేశానికి అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఇప్పటివరకు బెహరాన్ దేశానికి ఇజ్రాయెల్ అంబాసిడర్ ఎవరు లేరు. ఫస్ట్ టైం ఇది జరగటంతో ఇజ్రాయేల్ అదేరీతిలో అరబ్ కంట్రీ ల మధ్య శాంతి వాతావరణం నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది.కాగా అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయిల్ అరబ్ కంట్రీ ల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చడం జరిగింది. బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2019 ఆ టైంలో.. డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ దేశం లో జెరూసలేం నీ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా దౌత్య కార్యాలయం అక్కడకి తరలించడం జరిగింది. ఈ క్రమంలో చాలా అరబ్ కంట్రీ లు ఇజ్రాయిల్ దేశానికి అప్పటినుండి అనుకూలంగా ఉంటూ వచ్చాయి. ఇలాంటి తరుణంలో బెహరిన్ దేశం.. ఏకంగా అంబాసిడర్ నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం మీ లిస్టు లో సరికొత్త వాతావరణం నెలకొంది.