భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదివారం అర్ధరాత్రి చేపట్టిన ఎల్వీఎం – 3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. వన్ వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉప గ్రహాలతో విజయవంతంగా నింగికెగిసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఎల్వీఎం 3 ప్రయోగం సక్సెస్ కావడంతో శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. తమ శాస్త్రవేత్తలకు దీపావళి ముందుగానే మొదలైందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్ నాథ్ అన్నారు. ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్ విజయవంతం అవ్వడం వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మద్దతు ఉందని చైర్మన్ సోమ్ నాాథ్ తెలిపారు.
ఎల్వీఎం – 3 ద్వారా చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం ఇదే. ఈ మిషన్ కోసం వన్ వెబ్ – న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ శాటిలైట్లను రాకెట్ జియోసింక్రనస్ కక్షలో కాకుండా భూమికి 1200 కిలో మీటర్ల ఎత్తులో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) లో రాకెట్ ప్రవేశపెట్టింది. అందుకనే ఈ లాంచ్ వెహికల్ పేరును జీఎల్ఎల్వీ నుండి ఎల్వీఎంగా మార్చారు. జియోసింక్రనస్ ఆర్బిట్ భూ మధ్య రేఖకు 35,786 కిలో మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రయోగానికి ముందు నిన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు.
Breaking: విజయవాడ బాణాసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం .. ఇద్దరు సజీవ దహనం
పీఎం మోడీ, గవర్నర్ ల అభినందనలు
36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి నూత రికార్డును నమోదు చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు అభినందించారు. 5796 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను భారత్ రాకెట్లు కక్షలోకి తీసుకువెళ్లడం ఇదే మొదటి సారి. 1999 నుండి ఇస్రో 381 ఉప గ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి అనితర సాధ్యమైన పురోగతిని నమోదు చేసిందని కొనియాడారు. కాగా మరో 36 ఉపగ్రహాలను వచ్చే ఏడాది ప్రథమార్దంలో ప్రయోగించనున్నట్లు ఎన్ఐఎస్ఎల్ అధికారి తెలియజేశారు.
Indian Space Research Organisation (#ISRO) launches its first dedicated commercial mission of Launch Vehicle Mark 3 (LVM3) M2 satellite successfully in the wee hours today from the Satish Dhawan Space Centre Sriharikota in Andhra Pradesh. #LVM3M2 pic.twitter.com/9OdU6tIwpX
— All India Radio News (@airnewsalerts) October 23, 2022