(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-48 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని నిర్వహించారు. భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్ 1 ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను ఈ రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. మంగళవారం సాయంత్రం 4.40కు మొదలైన కౌంట్డౌన్ బుధవారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు కొనసాగింది. 628 కిలోల బరువున్న రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం విజయవంతంమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు.
#WATCH ISRO launches RISAT-2BR1 and 9 customer satellites by PSLV-C48 from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota; RISAT-2BR1 is a radar imaging earth observation satellite weighing about 628 kg. pic.twitter.com/mPF2cN9Tom
— ANI (@ANI) December 11, 2019