Water: రైలు ప్రయాణం చేసేటప్పుడు వాటర్ బాటిల్స్ ఎందుకు తీసుకువెళ్లడం స్టేషన్ లో ఉండే వాటర్ తాగేద్దాం అనుకుంటారు చాలామంది. మీరు ఇలా చేస్తే కనుక అనారోగ్య సమస్యలు మాత్రం తప్పవని గుర్తుపెట్టుకోండి. రైల్వేస్టేషన్లలో తాగునీటిని ఉపయోగిస్తే రోగాల బారిన పడకుండా తప్పించుకోలేరని.. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తుంది .
రైల్వే ప్రయాణీకులకు భారత రైల్వే శాఖ అందిస్తున్న సేవలు చాలా దారుణంగా ఉన్నాయని.. జాతీయ ఆరోగ్య, పర్యావరణ సంస్థ, మరియు జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తెలిసిన వివరాలను బీఈఎస్ తెలియచేసింది.రైల్వేస్టేషన్లలో దొరికే వంద ఎమ్మెల్ నీటిలో పది యూనిట్ల థర్మోటోలరెంట్ క్లోరోఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు ఈ పరిశోధనలో బయటపడింది. ఈ నీటిని తాగితే డయేరియా, గ్యాస్ట్రిక్, ఉదర సంబంధ వ్యాధులు ఖచ్చితం గా వస్తాయి అని వైద్యులు తెలియచేస్తున్నారు.ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న రైల్వే స్టేషన్లలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉందని, ఢిల్లీ, వారణాసి, పంజాబ్, గజియాబాద్ లాంటి ప్రాంతాల లో ఉండే రైల్వేస్టేషన్లలోని మంచి నీటిలో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఆ పరిశోధన లో బయట పడిందని.. బీఈఎస్ ప్రకటనలో తెలియజేసింది. దీనితో పాటు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, పెద్దలను ఈ బ్యాక్టీరియా ఇబ్బందులకు గురిచేస్తుందని డాక్టర్స్ తెలియచేస్తున్నారు .
కేవలం రైల్వే ఫ్లాట్ ఫామ్లలో గల నీటి కుళాయిల్లో మాత్రమే కాదు , అక్కడ అమ్మే వాటర్ బాటిల్స్లోనూ ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొనడం జరిగింది. ఉత్తరాది అయితే ఈ బ్యాక్టీరియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా ద్వారా క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని కాబట్టి ఈ నీటి ని తాగకుండా ఉండడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.