ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఐటి గ్రిడ్స్ డేటా వివాదం కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది.
మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటి గ్రిడ్స్ కార్యాలయాన్ని సిట్ అధికారులు సీజ్ చేశారు. గతంలో సంస్థలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన కంప్యూటర్లను సైతం స్వాధీనం చేసుకున్నాక శుక్రవారం ఆ కార్యాలయాన్ని సిట్ అధికారులు సీజ్ చేశారు. కార్యాలయం వద్దకు ఇతరులెవరూ రాకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరోవైపు పరారీలో ఉన్న ఐటీగ్రిడ్స్ ఎండి అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఎపి ప్రభుత్వం కూడా డేటా వివాదం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.