ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా కంప్లీట్ చేసి ఉన్నాడు. ఎలాగైనా మళ్ళీ క్రాక్ తో ట్రాక్ ఎక్కుతానని నమ్మకంగా ఉన్నాడు. అయితే గత నాలుగు సినిమాలు టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కోరాజా సినిమాలకి రవితేజ అదే అనుకున్నాడు. కాని అనూహ్యంగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి రవితేజ ని దెబ్బ తీశాయి. ఇక ఈ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబల్ రోల్ లో నటించబోతున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారని త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫాం లోకి వచ్చిన ఇస్మార్ట్ బ్యూటీస్ నిధీ అగర్వాల్, నభా నటేష్ రవితేజ కి జంటగా నటిస్తారట. ఇప్పటికే నభా రవితేజ తో డిస్కోరాజా సినిమాలో నటించింది. నిధీకి మాత్రం ఈ సినిమాతోనే రవితేజ తో జంట కడుతుంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. కాని హీరోయిన్ గా కాదట.
ఇందులో ఒక స్పెషల్ సాంగ్ అనుకుంటున్న చిత్ర బృందం ఈ సాంగ్ కోసం రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు రాశీఖన్నా స్పెషల్ సాంగ్ చేసింది లేదు. ఇంతకముందు కొంతమంది మేకర్స్ అడిగినా ఒప్పుకోలేదట. మరి రవితేజ కోసం ఒప్పుకుంటే మాత్రం గ్రేటే అని చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి సినిమాలు చేశారు కాబట్టి ఆ రిలేషన్ తో ఒప్పుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇక రాశీఖన్నా ప్రతీరోజూ పండగే సినిమాతో హిట్ అందుకుంది. ఇంకా ఏ సినిమాని కమిటవలేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!