Drinking Water: తాగునీరు ఎంతో అమూల్యమైనవి. ఎందుకంటే గుక్కెడు తాగునీరు కొరకు అల్లాడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి నీరు దొరికే వారు మాత్రం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం ముఖ్యం. నీటిని సరైన విధానం నిల్వ చేసుకుని తాగకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వర్షాకాలం లో వరదలతో తాగునీరు కలుషితమవుతాయి . కాబట్టి తాగునీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు.
Drinking Water: నీటిని నిల్వ చేసుకోవడానికి ముఖ్యంగా
నీటిని నిల్వ చేసుకోవడానికి ముఖ్యంగా మట్టి తో చేసిన లేదా రాగి పాత్రలో మాత్రమే నిల్వ చేసుకుని తాగడం వలన ఆరోగ్యానికి మంచిది అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మట్టి పాత్ర ల్లో మట్టి కణాల మధ్య చిన్న రంధ్రాలు ఉండి తద్వారా వాటిలో గాలి ఉండడం వలన మట్టి పాత్రలో నీరు డా చల్లగా ఉంటుంది.మట్టి పాత్ర ల్లో నిల్వ చేసుకున్న నీటిని తాగడం వల్ల శరీరంలో ఎసిడిటి , చర్మ వ్యాధులు తగ్గుతాయి.మట్టి పాత్రలో నిల్వ చేసిన నీరు కూడా చాలా రుచిగా ఉంటుంది. నీళ్లు తక్కువగా తాగే వారు ఈ పాత్రలో నీటిని నిల్వ చేసుకుంటే నీటిని ఎక్కువగా తాగడానికి మొగ్గు చూపుతారు. మంచి నీటిని నిల్వ చేసుకునే రెండో పద్ధతి రాగి పాత్ర. రాగి పాత్రలో నీటిని నిల్వ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాగి నీరు కఫ,వాత, పిత, వంటి రోగాల నుంచి రక్షణ కలిగిస్తుంది. రాగి పాత్రలో నీటిని తాగితే శరీరానికి అవసరమైన రాగి మూలకం కూడా తేలికగా అందుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ రాగి పాత్రలో చల్లని నీటిని మాత్రమే తీసుకోవాలి.మన అమ్మమ్మ,నానమ్మ తరాలలో తాగునీటికి గ్లాసులను కూడా రాగి వాడుకునేవారు. ఇంకా చెప్పాలంటే, రాత్రి రాగి పాత్రలో నీళ్లు పోసి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగడం అనేది చాలా మంచిది. అలా అని రాగి పాత్రలో ఆహారాన్ని వండడం కానీ నీళ్లు,పాలు వేడి చేయడం కానీ అస్సలు మంచిది కాదు. దీనివల్ల రాగి విషతుల్యం గా మారుతుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు.