‘సోలో బ్రతుకే సో బెటర్’ .. సుప్రీం హీరో.. మెగా మేనల్లుడునటించిన తాజా చిత్రం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. బివిఎస్యెన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో.. మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా డిసెంబర్ 25 న రిలీజ్ కి రెడీ అవుతోంది.
కాగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్రస్థానం దర్శకుడు దేవా కట్ట దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా జె.భగవాన్, పులారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి దాదాపు 35-40 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. కాని ఆ బడ్జెట్ మేకర్స్ జీ5 నుంచి ఫండిగ్ రూపంలో షెడ్యూల్ పరంగా వస్తుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది మంచి పరిణామం అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ నటించబోయే మరో సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా తర్వాత దాదాపు అందరు హీరోలు ఆ తరహా కథల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప కూడా అలాంటి జోనర్ లోనే తెరకెక్కుతోంది.
గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ని చూపించబోతున్నాడు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కాగా సాయి ధరమ్ తేజ్ కూడా ఇలాంటి కల్ట్ కంటెంట్ తో తెరకెక్కనున్న సినిమాలో నటించబోతున్నాడట. సాయి ధరమ్ తేజ్ కూడా రంగస్థలం సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఇలాంటి కథ లో నటించడానికి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మాటలని బట్టి సాయి ధరమ్ తేజ్ విన్న కథ రంగస్థలం కథ ని మించి ఉంటుందని సమాచారం. ఈ సినిమాని భోగవిల్లి ప్రసాద్ నిర్మించబోతుండగా దర్శకుడు సుకమార్ స్క్రిప్ట్ తో పాటు తను కూడా నిర్మాణంలో భాగం అవుతున్నాడు. ఇక ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుండగా సుకుమార్ శిష్యుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.