విజయవాడ, డిసెంబర్ 24: సీఎం ప్రకటింది శ్వేతపత్రం కాదు పచ్చ పత్రం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు విమర్శించారు. సోమవారం పార్టీ అధికార ప్రతినిధి దాసరి ఉమామహేశ్వరరాజు మాట్లాడుతూ ప్రదానమంత్రి నరేంద్ర మోడీ గుంటూరులో మొదటి రాజకీయ సభకు వస్తుంటే మోడీ రాకను నిరసిస్తూ పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.
పోలవరం ప్రాజెక్టును ర్యాంపు వాక్ గా మార్చారని విమర్శించారు. కాంగ్రేస్ తో వారు కలవడాన్ని ప్రజా సంక్షేమం కోసం అని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాన్ని అవినీతి ఆంద్రప్రదేశ్ మార్చేశారని దుయ్యబట్టారు. మోదీ రాష్ట్ర పర్యటనను అడ్డుకోమని మంత్రులకు అదేశించడం దారుణమన్నారు. టిడిపి నాయకులు చదువుకున్న దద్దమ్మలా అని ప్రశ్నించారు. కేంద్రం ఇప్పటి వరకూ ఏమి చేసిందో చూస్తే తెలుస్తుందన్నారు. మోడీ రాకను అంతరాయం కలిగిస్తే ప్రజలు మీకు బుద్దిచెప్పుతాని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసిన అంశాలను వివరించారు. 2014 ముందు ఆంద్రప్రదేశ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బందరు పోర్టు కు భూసేకరణ చేయలేకపోయారు,.కనకదుర్గమ్మ ప్లే అవర్ పూర్తి చేయలేకపోయాని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేశారన్నారు. ప్రపంచంలో ఎవరు చేయలేని అవినీతి టిడిపి ప్రభుత్వం చేస్తుందన్నారు. విజయవాడ లో వేల సంఖ్యలో ఇళ్ళు వచ్చాయని డీడీలు తీసుకుంటున్నారు. అసలు మంజూరు అయిన ఇళ్ళు ఎన్ని అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వమే స్కాముల ప్రభుత్వమని విమర్శించారు.
మరో రాష్ట్ర అధికార ప్రతినిధి జాగర్లమూడి.గాయిత్రి మాట్లాడుతూ ,సీఎం విడుదల చేసిన శ్వేత పత్రం కాదు, అది పచ్చ పత్రం అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టి కేంద్రం ఎమి ఇవ్వలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. వచ్చిన కేంద్ర యూనివర్శిటీలు రాలేదని చెప్పండి, చెప్పలేరు, ఎపిలో కేంద్ర విద్యాలయాలు రాలేదా అని ప్రశ్నించారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ చేయలేక కేంద్రం రుణాలు ఇవ్వలేదని ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. కేంద్రం ప్రకటించిన పధకాలను మీ పధకాలుగా కలర్ ఇస్తున్నారని అన్నారు.
previous post