IT Jobs: ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ సంవత్సరం లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. 2022 కల్లా భారత్ లో 45 వేల మంది ఫ్రెషర్లను తీసుకుంటామని తెలిపింది. మొత్తం లక్ష ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ నంబియార్ తెలిపారు. ఇప్పటికే ఈ సంవత్సరం కంపెనీలో 17వేల మందికిపైగా కొత్త పట్టభద్రులను నియమించినట్లు చెప్పారు. ఇంటర్న్ షిప్ లకు కూడా అధక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
అత్యంత ప్రతిభ కల్గిన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులతో పాటు ఇతర నిపుణుల నియామకాలను కొనసాగిస్తున్న సంస్థల్లో ఒకటిగా తాము నిలుస్తామని నంబియార్ చెప్పారు. గత సంవత్సరం క్యాంపస్ డ్రైవ్ ద్వారా 20వేల మంది ఫ్రెషర్స్ ను తమ సంస్థలో చేర్చుకున్నామని వెల్లడించారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో ఇండియా ఒకటిగా ఉంటుందన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీ చేయాలని సంస్థ నిర్ణయం తీసుకున్నదని నంబియార్ తెలియజేశారు.
ఐసి సంస్థలో ఉద్యోగం వస్తే చాలా జీవితం షటిల్ అవుతుందని ఇంజనీరింగ్ పట్టభద్రులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నుండి కరోనా నేపథ్యంలో రిక్రూట్ మెంట్ లుగా ఇంతకు ముందుగా లేకపోవడంతో ఇంజనీరింగ్ పట్టభద్రులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూనే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఈ తరుణంలో వివిధ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఫ్రెషర్స్ కు అవకాశం కల్పిస్తుండటం వారిలో ఆనందాన్ని కల్గిస్తోంది.