హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామనాయుడు స్టూడియోపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఈ ఉదయం నుండి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహించిన లావాదేవీలకు సంబందించి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలుగా సురేష్ ప్రొడక్షన్స్ చూపుతున్న లెక్కల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన హైదరాబాద్ ఐటి వింగ్ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.