కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ పంజా విసిరింది. ప్రముఖ నటులు నిర్మాతల నివాసాలపై ఈ రోజు ఐటీ అధికారులు దాడులు చేశారు. కన్నడ సూపర్ స్టార్, కన్నడ కంఠీరవ దివంగత రాజ్ కుమార్ కుమారులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ఇళ్లపై ఐటీ అధికారలు ఈ రోజు దాడులు చేశారు.
అలాగే మరో అగ్రహీరో సుదీప్ నివాసంపైనా నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ నివాసంపైనా కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రశ్రేణి కన్నడ నటులు, నిర్మాతల నివాసాలలో ఈ రోజు ఐటీ అధికారులు సోదాలు చేశారు, దాదాపు 200 మంది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రాంతాలలో ఈ రోజు ఉదయం దాడులు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?