కరోనా వైరస్ నేటి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి. పేదోడిని కటిక పేదరికంలోకి నెట్టిన ఈ వైరస్ నేటికి అదే దిశగా పరుగులు తీస్తోంది. ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వల్ల సమాజిక దూరం పాటిస్తూ.. పనులు చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. అయితే అన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృభిస్తున్న ఈ సమయంలో మన దేశంలో మాత్రం కొంత తక్కువే అని చెప్పొచ్చు. దీన్ని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
కరోనా మహమ్మారి ఆటలు భారత్ లో అంతగా సాగడం లేదని ఒక పరిశోధన కూడా చెబుతోంది. దీనికి నిదర్శనంగా అత్యల్ప కరోనా మరణాల రేటు, అత్యధిక రికవరీల రేటులను చూపుతున్నారు ఈ పరిశోధకులు. కొన్ని రోజులుగా కొత్తగా నమోదౌతున్న కేసుల సంఖ్య కూడా ఘననీయంగా తగ్గిందని చెబుతున్నారు ఈ పరిశోధకులు. అయితే ఎందుకు మన దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. రికవరీలు పెరుగుతున్నాయనే విషయాలను వారు రీసెర్చు చేశారు.
ఈ రీసెర్చ్ లో పలు విషయాలు భయటపడ్డాయి. వాటిని వింటే మనకు ఆశ్చర్యం వేయక మానదు. దీనికి కారణం మన దగ్గరున్న మురికేనట. అవును మీరు చదివింది నిజమే.. మన దేశంలోని వారు అతిశుభ్రత పాటించక పోవడం వళ్లే మనల్ని కరోనా వైరస్ ఏం చేయలేకపోతుందంటా.. అదేంటి ఎలా అంటారా ? మనం మురికిగా ఉన్నందుకు మనలో ఇమ్యునిటీ పవర్ ఎక్కువగా ఉంటుందంటా.. ఆ ఇమ్యూనిటీ వలన కరోనా మనల్నీ ఏం చేస్తాలేదంట.
అయితే.. అతి అపరిశుభ్రత కూడా మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. అలా వదిలేయడంతో మరెన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కరోనా వైరస్ ను తట్టుకునే శక్తి వస్తుందని అపరిశుభ్రంగా ఉండొద్దని సూచిస్తున్నారు. అలాగే కరోనా విషయంలో మరిన్ని జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సమాజిక దూరాన్ని పాటిస్తూ పనులు చేసుకోవాలని దాంతో మహమ్మారిని దరికి చేరనివ్వకుండా చేయొచ్చని చేబుతున్నారు.