ఢిల్లీ, జనవరి 26: మంచు శిఖరాన జాతీయ పతాకం రెపరెపలాడింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు యంత్రాంగం మైనస్ 30 డిగ్రీల పరిస్థితుల్లో సైతం జాతీయ జెండాను ఎగురవేశారు. లఢక్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో తెల్లని దుస్తులు ధరించి ఐటిబిపి జవానులు జెండాను ఆవిష్కరించారు.
హిమగిరుల్లో భద్రతా బలగాలు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేసి జాతీయతను చాటిచెప్పారు. ఈ ఫొటో రిపబ్లిక్ డే వేడుకల్లో వైరల్ అయ్యింది.