కరోనా నేపథ్యంలో థియేటర్స్ మూత పడటంతో రిలీజ్ కు సిద్ధమయిన సినిమాలు కొత్త కొత్త మార్గాల్లో ప్రేక్షకులను చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు ‘డర్టీ హరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేశారు.
అయితే, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది. ఈ సినిమా ప్రధాన పాత్రల్లో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ లు నటించారు. ముందుగా ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త ఏటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో క్రిష్మస్ కానుకగా ‘ఆహా’ యాప్ లో కూడా ఈ సినిమా ను స్ట్రీమింగ్ కి పెట్టారు.
టాలీవుడ్ లోనే సీనియర్ ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేస్తునందున ఈ సినిమాకి మొదటి నుంచి ఇండస్ట్రీ ప్రముఖుల సపోర్ట్ ఉంది. ఇప్పటికే సినిమా విడుదలై వారం రోజులు దాటినా ఇంకా హౌసేఫుల్ అన్నట్టు ఈ సినిమాకి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కానీ ఇప్పటికి ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో పాజిటివ్ రెస్పాన్సులు వస్తూనే ఉన్నాయి..
తాజాగా ఈ సినిమా గురించి సీనియర్ నటుడు నరేష్ ట్వీట్ చేస్తూ ‘ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ సినిమాను నా ఫ్రెండ్స్ మరియు ఫాలోవర్స్ అందరూ చూడాలని కోరుకుంటున్నా’ నని పేర్కొన్నాడు. అలానే టాలీవుడ్ లోని ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేస్తూ ‘మా ఎమ్ ఎస్ రాజు ‘డర్టీ హరి’ సినిమా చూసాను. మా నిర్మాత ఇంతమంచి దర్శకుడు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పోస్టర్ చూసిన వారు ఏదో అనుకుంటారు కానీ క్లైమాక్స్ యూత్ కి ఒక కనువిప్పు’ అని చెప్పారు.