ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తావించడం జరిగింది. రెండు రోజుల క్రితం తనకు జరిగిన అనుభవం గురించి ఐవైఆర్ వివరించారు. ఈ నెల పెన్షన్ వారం తర్వాత వచ్చిందని…. నెల ప్రారంభమైన ఏడు రోజుల తర్వాత తనకు పెన్షన్ డబ్బులు పడ్డాయి అని అన్నారు. సహజంగా ఏ ప్రభుత్వానికైనా ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఇవ్వాల్సిన వడ్డీ చెల్లింపులు మొదటి వరుసలో ఉంటాయి…. సహజంగా ఇలాంటి చెల్లింపులు నెల మొదట్లో ఒకటి రెండు రోజులు అటూ ఇటుగా పడుతూ ఉంటాయి కానీ ఇలా వారం రోజులు జాప్యం ఎప్పుడూ జరగలేదని అన్నారు.
కృష్ణారావు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంగా…. బయటికి వస్తున్న వాదన ఏమిటంటే ఐవైఆర్ మాటల వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసించే దిశగా ఏపీ బిజెపి కీలకమైన అడుగులు వేసేందుకు కేంద్రం ఈ విధంగా ముఖ్య నేత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తోందని అంటున్నారు. వైసిపి వర్గాలు కూడా ఇన్ డైరెక్ట్ గా మోడీ వారి తీరును తప్పుబడుతున్నారు అని అంటున్నారు. కృష్ణారావు చెబుతున్న మాటలు ఏమిటంటే.. వస్తున్న ఆదాయం గురించి ఆలోచించకుండా పెద్ద ఎత్తున వ్యయం చేస్తూ ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా భంగపాటు తప్పదని…. ఒక నాలుగు రోజుల వెనక ముందు అంతే…. రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఏ రాష్ట్రానికి వీలు కాని రీతిలో జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు పెద్ద వివాదాస్పదమయ్యింది. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే రాష్ట్రంలో వచ్చిన ఆదాయం నుండి సంక్షేమ పథకాలకు చెల్లెంచి…. తెచ్చిన అప్పులు పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఆదాయం వచ్చేలా చూడాలని అంతేగాని అప్పులు తీసుకువచ్చి ప్రజల సంక్షేమ పథకాల పేరున పంచి పెడితే చివరికి దివాలా తీసేది ఖాయం అంటూ ఐవైఆర్ తెలిపారు.
ఎప్పుడూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకు పడే కృష్ణారావు ఇలా జగన్ పై విమర్శలు చేయడం ఎంతో మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా మోడీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టకూడదని కేంద్రం నుండి జగన్ కు లేఖ పంపించిన వెంటనే ఇలా ఒకరి తర్వాత ఒకరు అతని ప్రభుత్వంపై…. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం వెనుక మోడీ హస్తం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.