Breaking: జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైయ్యారు. షొపియాన్ జిల్లా ముంజా మార్గ్ ప్రాంతంలో మంగళవారం వేకువ జామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ఉగ్రవాదులను ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబహా సభ్యులుగా గుర్తించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని సమాాచారం. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మూడవ వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.
మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరు షోపియాన్ జిల్లాకు చెందిన లతీఫ్ లోన్ గా గుర్తించారు. ఇతను కశ్మీర్ పండిట్ పురాణ కృష్ణ భట్ హత్యలో పాల్గొన్నట్లు గుర్తించగా, మరోక ఉగ్రవాది అనంతనాగ్ కు చెందిన ఉమర్ నజీర్ గా గుర్తించారు. నజీర్ .. టిల్ బహదూర్ హత్యలో పాల్గొన్నట్లు కశ్మీర్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఉగ్రవాదుల నుండి ఒక ఏకే – 47 రైఫిల్, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏడిజి చెప్పారు.