Janhvi kapoor – khushi kapoor: అతిలోకసుందరి దివంగత సినీ నటి శ్రీదేవి స్టార్ హీరోయిన్గా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్గా మారిన శ్రీదేవీ హిందీతో పాటు తెలుగు, తమిళ సహా మిగతా సౌత్ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసీ ఎన్నో అఖండ విజయాలను అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీదేవి. అందాల తారగా వెలిగిన శ్రీదేవీ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు సహా వారి తనయులు ..అలాగే మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో నటించి తనకి తానే సాటి అనిపించుకున్నారు.
కొన్నేళ్లు సినిమాలకి గ్యాప్ ఇచ్చిన శ్రీదేవి నటన మీద ఉన్న ఆసక్తి, ప్రేమ, గౌరవంతో ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. అంతగా తనకి సినిమా రంగ మీద అభిమానం ఉంది. ఆమె మాదిరిగానే తన నట వారసురాళ్ళు కూడా హీరోయిన్స్గా మంచి క్రేజ్ తెచ్చుకోవాలని ముఖ్యంగా హిందీ కంటే కూడా తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్స్గా రాణించాలని కలలు కన్నారు. తనంతటి గొప్ప హీరోయిన్స్ చేసేందుకు చాలానే పట్టుదలగా ఉండేవారు శ్రీదేవి. తన కళ్ళ ముందే కూతుళ్ళ నటనా జీవితం గొప్పగా ప్రారంభం అవ్వాలని నటీమణులుగా విమర్శకుల ప్రశంసలు అందుకోవాలని తాపత్రయపడేవారు.
Janhvi kapoor – khushi kapoor: లైగర్ సినిమాలో జాన్వీనే హీరోయిన్ అన్నారు.
కానీ ఇవేవీ చూడకుండానే శ్రీదేవీ అనంత లోకాలకు వెళ్ళిపోయారు. అయితే తల్లి కోరిక ఆశను జాన్వీ కపూర్ నెరవేర్చింది. మరాఠిలో సూపర్ హిట్గా నిలిచిన సైరాట్ అనే సినిమా హిందీ రీమేక్తో జాన్వీ హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి నటి అని పేరు తెచ్చుకుంది. శ్రీదేవికి ఇచ్చిన మాట ప్రకారం బాలీవుడ్ స్టార్ మేకర్స్ కరణ్ జోహార్ జాన్వీ సినిమాలకి సంబంధించిన బాధ్యతలను చూసుకుంటూ జాన్వీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. మరొకవైపు స్టార్ మేకర్ అయిన బోనీకపూర్ కూడా కూతుళ్లకి బాగా సపోర్ట్ చేస్తూ హీరోయిన్స్గా ఎదగడానికి అన్నీ విధాలా అండగా ఉంటున్నాడు.
అయితే బాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న జాన్వీ కపూర్ టాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటి వరకు అవకాశాలు అందుకోలేకపోవడం గమనర్హం. గత రెండు, మూడేళ్ళుగా జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదుగో అదుగో అంటున్నారే తప్ప జాన్వీనీ టాలీవుడ్కి తీసుకు వచ్చే దర్శక, నిర్మాతలు కనిపించడం లేదు. పూరి జగన్నాథ్ ఇప్పుడు తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాలో జాన్వీనే హీరోయిన్ అన్నారు. కానీ అనన్య పాండే నటిస్తోంది. అలాగే జూనియర్ ఎన్.టి.ఆర్ నటించబోయే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయం కాబోతుందని ప్రచారం జరిగింది.
Janhvi kapoor – khushi kapoor: జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లలో ముందు టాలీవుడ్ ఎంట్రీ ఎవరిస్తారో..?
అదీ లేదు. ఇక జాన్వీ చెల్లి ఖుషీ కపూర్ అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్ సినిమాతో టాలీవుడ్కి పరిచయం కానుందని అన్నారు. కానీ సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. బోనీకపూర్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో కూతుర్లను హీరోయిన్గా పరిచయం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎందుకనో అడుగు ముందుకు పడటం లేదు. చూడాలి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లలో ముందు టాలీవుడ్ ఎంట్రీ ఎవరిస్తారో. జాన్వీకి ఆల్రెడి హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి తనే ముందు పరిచయం అవుతుందని అంటున్నారు.