ఈ మధ్య జబర్దస్త్ స్కిట్ లలో కంటెంట్ తగ్గింది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎవరి మీద వారే సెటైర్లు వేసుకుంటూ యాంకర్స్ పైన, జడ్జ్ ల మీద పంచ్ లు వేస్తూ స్కిట్లు కానిచ్చేస్తున్నారు. ఇక హైపర్ ఆది కేవలం తన టీం సభ్యులు టార్గెట్ చేసి ఎంత రోస్ట్ చేస్తాడో అందరికీ తెలిసిందే. అతని స్కిట్లలో జడ్జి ల పైన ఒక కామెంటు ఎప్పుడూ ఉంటుంది.
ఆమధ్య రాకేష్ మాస్టర్ పైన పైన గురించి కూడా కామెంట్లు చేశాడు. అంతేకాకుండా ప్రేక్షకులకు మొదటిసారి కొంతమంది స్కిట్లు వేసే సమయంలో జడ్జి ఉండరని…. వారు లేకపోయినా ఎడిటింగ్లో మేనేజ్ చేశారని అసలు గుట్టు విప్పాడు. గతంలో జడ్జి లు అసలు పర్ఫార్మెన్స్ చూడరు…. ఫోన్ లు పట్టుకుని బిజీగా ఉంటారు…. డైరెక్టర్ అని చెప్పినప్పుడు మాత్రమే నవ్వుతారు అంటూ చెప్పేసిన ఘనత ఆది ది.
ఇక కొందరు స్కిట్లు చూడ లేక మరే ఇతర కారణాలతోనే అయినా ఒక్కోసారి జడ్జిలు తమ ఫోన్లలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనిపై తాజాగా రోజా పైన కూడా ఒక పంచ్ వేశారు. ఇమ్మన్యుయేల్ స్కిట్ లో ఒకడు రోజా గారి చార్జర్ కొట్టేశాను అని అంటాడు.
ఎందుకని అడిగితే…. ఆమె ఫోన్లో చార్జింగ్ అయిపోతుంది కనీసం అప్పుడైనా మన స్కిట్ చూస్తారు అని సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు. వెంటనే రోజా నా చార్జర్ కొట్టేస్తారు కానీ…. మంచి కంటెంట్ మాత్రం చేయరు అంటూ కౌంటర్ వేస్తుంది. కాబట్టి స్కిట్లు బాగోలేకపోతే మధ్యలో జడ్జ్ లు ఫోన్ పట్టుకొని బిజీ అవుతారు అన్నమాట.