తెలుగు వారందరి ఇళ్లల్లో వారానికి రెండు రోజులు రాత్రిపూటల నవ్వుల పువ్వులు పోయించే పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ మళ్లీ ప్రసారం కాబోతోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమాలతో పాటు సీరియల్స్, టీవీ షో ల షూటింగ్ లపై కూడా ఆంక్షలు విధించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా వాటిని ఎత్తి వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో జబర్దస్త్ షూటింగ్ మొదలు కానుంది.
2013లో నాగబాబు, రోజా జడ్జీలుగా… సినిమాలో అప్పుడప్పుడే పైకి వస్తున్న కామెడీ ఆర్టిస్టులు…. ఇంకా హాస్యం పై అమితాసక్తి ఉన్న టాలెంటెడ్ కమెడియన్ ల తో మొదలైన ఈ షో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించింది. జనాల్లో ఉన్న క్రేజ్ వల్ల ‘జబర్దస్త్’ మరియు ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ గా మల్లెమాల ప్రొడక్షన్ వారు ఈ షో ను 2 ప్రోగ్రామ్ లుగా.. రెండు రోజులకు విభజించారు.
ప్రస్తుతానికి జబర్దస్త్ కు అనసూయ యాంకర్ గా ఉండగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ రేష్మి యాంకర్ గా చేస్తూ ఉంది. కొద్ది నెలల క్రితమే నాగబాబు జబర్దస్త్ షో నుండి జడ్జీగా తప్పుకున్న విషయం తెలిసిందే. జడ్జీలు మారినా కమెడియన్లు మారినా ఈ షో కి ఉన్న క్రేజ్ మాత్రం మారలేదు. ఇక ప్రతి గురువారం మరియు శుక్రువారం మీ ఇంట్లో నవ్వుల పండగ మొదలైపోయినట్లే.