భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రఖ్యాత ఆటగాడు ధోని అంతర్జీతీయ క్రికెట్ నుండి ఈరోజు రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటూ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించారు. ధోని రిటైర్మెంట్ పై సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు.
* ధోని మీరు అంతర్జాతీయ క్రికెట్ కి అందించిన సేవలు ముందు తరాలకు స్పూర్తి నింపుతాయి. అత్యద్భుతంగా సాగిన మీ కెరీర్ పట్ల మీకు శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు మరింత బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
* ధోని ప్రారంభించబోతున్న కొత్త జీవితానికి ముందస్తు శుభాకాంక్షలు. ఇండియా క్రికెట్ జట్టు జెర్సీ మీరు ఇక వేసుకోరు అనడం కొంత బాధకారమే, మీ లోని ఉత్తమ క్రికెట్ ఆటని మేము మిస్ అవుతున్నాము. దేశ క్రికెట్ కి మీరు గర్వపడేలా చేశారు, మరింత విలువ తీసుకువచ్చారు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.