ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలు సెప్టెంబర్ 5 నుండి మొదలయ్యే అవకాశాలున్నట్లు ప్రకటించారు. మార్చ్ లో కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు.
విద్యార్థులను పరీక్ష లేకుండానే పై తరగతికి ప్రమోట్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు తర్వాతి విద్యా సంవత్సరానికి పాఠశాలలు సెప్టెంబర్ 5 నుండి ఉంటాయని చూచాయిగా ప్రకటించారు జగన్. ఈ క్రమంలో వైఎస్సార్ విద్యా కనుకను సిద్ధం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. వైఎస్సార్ విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు కిట్ ను అందించనున్నారు. ఆ కిట్ లో స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, 3 జతల యూనిఫామ్, ఒక జత షూస్, రెండు జతల సాక్స్, ఒక బెల్ట్ మరియు మాస్క్ ను కూడా ఇవ్వనున్నారు.